Share News

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రూ.200 జరిమానా

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:27 AM

సావర్కర్‌పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్‌ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణను ఏప్రిల్‌ 14కు వాయిదా వేస్తూ ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రూ.200 జరిమానా

న్యూఢిల్లీ, మార్చి 5: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్‌ గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణను ఏప్రిల్‌ 14కు వాయిదా వేస్తూ ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. 2022లో మహారాష్ట్రలో ఓ సమావేశంలో వీర సావర్కర్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై నృపేంద్ర అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరగగా.. రాహుల్‌ గైర్హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 05:27 AM