Ladakh: త్రీ ఇడియట్స్ పాఠశాలకు ఎట్టకేలకు సిబిఎస్ఈ గుర్తింపు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:52 AM
'త్రీ ఇడియట్స్' సినిమా ద్వారా ప్రసిద్ధి చెందిన లడఖ్లోని పాఠశాలకు ఎట్టకేలకు సీబీఎస్ఈ గుర్తింపు లభించింది. ఈ పాఠశాల జమ్ము-కశ్మీర్ విద్య బోర్డుకు అనుబంధంగా ఉండగా, తాజాగా సీబీఎస్ఈకి అనుబంధం పొందింది. ఈ పాఠశాల 15వ శతాబ్దానికి చెందిన మిఫామ్ పెమా కార్పొ పేరు పెట్టబడింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్27: త్రీ ఇడియట్స్ సినిమాతో ప్రసిద్ధి చెందిన లడఖ్లోని పాఠశాలకు ఎట్టకేలకు సీబీఎ్సఈ గుర్తింపు లభించింది. రాంచో పాఠశాలగా స్థానికులు పిలిచే ఈ పాఠశాల 2009లో బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ నటించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమాతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు జమ్ము, కశ్మీర్ పాఠశాలవిద్య బోర్డుకు అనుబంధంగా ఉంది. సంప్రదాయ బట్టీ చదువులకు భిన్నంగా వినూత్న విధానాలతో ఇక్కడ బోధన సాగుతుంది. నూతన జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన సంస్కరణలను ఈ పాఠశాల ముందే అనుసరిస్తుండడం గమనార్హం. 24ఏళ్లు నిండిన ఈ పాఠశాలకు 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పండితుడు మిఫామ్ పెమా కార్పొ పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News