Karnataka Minister: ఉగ్రవాదులు మతం అడగలేదు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:34 AM
పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉగ్రవాదులు మతం అడిగే వారిలేరని, దాడులను మతపరమైనదిగా చూపించేందుకు కుట్ర జరుగుతుందన్నారు, ఈ వ్యాఖ్యలు బీజేపీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి.

కర్ణాటక మంత్రి తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు, ఏప్రిల్ 27: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మతం అడిగి కాల్చారని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తుపాకీతో పేల్చే ఉగ్రవాది కులం, మతం అడుగుతాడా? కాల్చుకుంటూ వెళ్లిపోతాడంతే! ప్రాక్టికల్గా ఆలోచించండి’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిని మతపరమైన అంశంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ తిమ్మాపూర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది బాధిత కుటుంబాలను అవమానించడమేనని బీజేపీ మండిపడింది.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News