Share News

Siddaramaiah: యుద్ధం వద్దనలేదు

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:23 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాకిస్థాన్‌తో యుద్ధం పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆయన యుద్ధం అవసరమేనని కానీ, అనివార్యమైతే చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, ప్రతిపక్షం విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప సిద్దరామయ్య నుండి క్షమాపణ కోరారు.

Siddaramaiah: యుద్ధం వద్దనలేదు

బెంగళూరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో యుద్ధం వద్దని తాను చెప్పలేదని, యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే అన్నానని, అనివార్యమైతేనే యుద్ధం చేయాలన్నానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. యుద్ధం విషయంలో శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తడంతోపాటు పాకిస్థాన్‌ టీవీ చానళ్లలోనూ యుద్ధంపై భారత్‌లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయంటూ సిద్దరామయ్య వ్యాఖ్యలను ప్రసారం చేశాయి. దీంతో సిద్దరామయ్య ఆదివారం వివరణ ఇచ్చారు. కాగా, సిద్దరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పాకిస్థాన్‌పై యుద్ధం అవసరం లేదనే వ్యాఖ్యలతో సిద్దరామయ్య పాకిస్థాన్‌ రత్న అయ్యారని కర్ణాటక ప్రతిపక్షనేత అశోక్‌ విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు నాయకులుగా ఉండటమే మన దేశానికి అతిపెద్ద విషాదమన్నారు. ప్రజలకు సిద్దరామయ్య క్షమాపణ చెప్పాలని మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:23 AM