Cyber Fraud: ఈడీ నుంచి ఐ4సీకి సమాచారం
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:01 AM
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం మోసాల నివారణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఎల్ఏ కింద ఐ4సీని ఈడీతో సమాచారాన్ని పంచుకునే అధికారాన్ని ఇచ్చింది. ప్రజలను సైబర్ మోసాల గురించి నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా 1930 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది.
సైబర్ మోసాల కట్టడి లక్ష్యంతో కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో సైబర్ మోసాలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడితోపాటు నగదు జాడను గుర్తించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు అధికార మిచ్చింది. ఈమేరకు పీఎంఎల్ఏలోని సెక్షన్ 66 కింద ఐ4సీని చేర్చుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈడీ, ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఐ4సీ సమాచారం పంచుకోవడానికి, పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు లక్ష్యంగా సైబర్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార పంపిణీ వల్ల ఈ మోసాల వెనకున్న సూత్రధారులను గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా మోసం జరిగిన సందర్భాల్లో అలాంటి వెబ్సైట్లకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా లేదా 1930కి కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News