Election Commission: తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించిన ఈసీ
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:02 AM
బిహార్లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
పట్నా, ఆగస్టు 18: బిహార్లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) లో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపుపై కొద్దిరోజులుగా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్లను ఈనెల 19 నాటికి బహిర్గతం చేసి.. 22 నాటికి ఆ నివేదికను దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో ఈసీ అధికారులు చర్యలు చేపట్టారు. ‘అన్ని పోలింగ్ బూత్ల వారీగా ‘ఏఎ్సడీ’ (గైర్హాజరు, బదిలీ చేసిన, చనిపోయిన) ఓటర్ల పేర్లను ఈసీ ప్రచురిస్తోంది. అలాగే ఆన్లైన్లోనూ ఈ వివరాలను చూసుకోవచ్చు’ అని ఎన్నికల అధికారులు తెలిపారు.