CP Radhakrishnan: రేపు సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:41 AM
మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ...
న్యూఢిల్లీ, ఆగస్టు 18: మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీని కలిశారు. అంతకుముందు రాధాకృష్ణన్కు బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, ప్రహ్లాద్ జోషి, కిరెన్ రిజిజు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం రాధాకృష్ణన్ ఎన్డీయే పార్టీల నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన బుధవారం(ఆగస్టు 20) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రలతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు, కీలక నాయకులు పాల్గొంటారని సమాచారం.