Pahalgam Attack: పహల్గాంపై రివ్యూకమిటీ వేయండి
ABN , Publish Date - May 14 , 2025 | 05:59 AM
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై లోతైన అధ్యయనానికి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1999లో కార్గిల్ యుద్ధం తరువాత కూడా వాజపేయీ ప్రభుత్వం కసరత్తును చేసినట్లు జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 13: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు దారితీసిన కారణాలపై లోతైన అధ్యయనం కోసం రివ్యూ కమిటీని నియమించాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కార్గిల్ యుద్ధం ముగిసిన వెంటనే ఇలాంటి కసరత్తును అప్పటి వాజపేయీ ప్రభుత్వం చేసిందని ఏఐసీసీ సమాచార విభాగం ఇన్చార్జి జైరామ్ రమేశ్ గుర్తుచేశారు. ‘‘కార్గిల్ యుద్ధం ముగిసిన మూడోరోజున, 1999 జూలై 29న, అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్గిల్ రివ్యూ కమిటీని ఏర్పాటుచేసింది’’ అని వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తండ్రి, వ్యూహాత్మక వ్యవహారాల గురు కె.సుబ్రహ్మణ్యం ఆ రివ్యూ కమిటీకి నాయకత్వం వహించారని జైరామ్ రమేశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..