Karnataka CM Siddaramaiah: ఇన్ఫోసిస్ వారు బృహస్పతులా: సిద్దరామయ్య
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:55 AM
కర్ణాటకలో సామాజిక, ఆర్థిక సమగ్ర గణాంకాల కోసం చేపడుతున్న కులగణన సర్వేలో పాల్గొనేది...
బెంగళూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సామాజిక, ఆర్థిక సమగ్ర గణాంకాల కోసం చేపడుతున్న కులగణన సర్వేలో పాల్గొనేది లేదన్న ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులపై సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. ఇన్ఫోసిస్ వారు బృహస్పతులా అంటూ ప్రశ్నించారు. సర్వే చేస్తున్నది బీసీ కమిషన్ ద్వారా అయినా కేవలం వెనుకబడినవర్గాల కోసం మాత్రమే కాదన్నారు. రాష్ట్రంలో ఏడు కోట్లమంది సర్వేలో పాల్గొంటుండగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వివరాలు ఇవ్వమని చెప్పడం సమంజసం కాదన్నారు.