Tribal Atlas: ‘గిరిజన అట్లా్స’ను రూపొందించండి
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:26 AM
ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా, సంస్కృతి, ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంతదూరం వెళుతున్నారు తదితర వివరాలను ఈ అట్లా్సలో పొందుపరచాలని సూచించింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ‘గిరిజన అట్లా్స’ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా, సంస్కృతి, ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంతదూరం వెళుతున్నారు తదితర వివరాలను ఈ అట్లా్సలో పొందుపరచాలని సూచించింది. భూమి హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచన చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 1 నాటికి దరఖాస్తుదారుల్లో 48.95 శాతం మందికి భూ హక్కు కల్పించారు. 36.43 దరఖాస్తులను తిరస్కరించగా.. 14.62ు అపరిష్కృతంగా ఉన్నాయి. ఒడిసా 2018లోనే ఈ అట్లా్సను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు తయారుచేయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.