Election Outcome : మరో రెండు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:54 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి రానున్నదని టుడేస్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థలు వెల్లడించాయి. గురువారం తమ అంచనాలను ప్రకటించాయి. ఎన్నికల్లో బీజేపీకి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి రానున్నదని టుడేస్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థలు వెల్లడించాయి. గురువారం తమ అంచనాలను ప్రకటించాయి. ఎన్నికల్లో బీజేపీకి 51, ఆమ్ ఆద్మీకి 19 సీట్లు లభిస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. అదేవిధంగా బీజేపీకి 45 నుంచి 55 సీట్లు, ఆమ్ ఆద్మీకి 15-20 సీట్లు, కాంగ్రె్సకు 0-1, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలిపింది.