Satyendra Das: ‘అయోధ్య’ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ కన్నుమూత
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:47 AM
లక్నోలోని సంజయ్గాంధీ మెడికల్ పీజీ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్కు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

లక్నో, ఫిబ్రవరి 12: అయోధ్య రామ మందిరం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ (85) బుధవారం కన్నుమూశారు. లక్నోలోని సంజయ్గాంధీ మెడికల్ పీజీ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్కు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఈనెల 3 నుంచి న్యూరాలజీ వార్డులోని హై డిపెన్డెన్సీ యూనిట్లో ఆయనకు చికిత్స అందించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సత్యేంద్ర దాస్ పార్ధివదేహాన్ని అయోధ్యలోని ఆయన ఆశ్రమం సత్యధామ్ గోపాల్ మందిర్కు తరలించారు. సత్యేంద్ర దాస్ బంధువుల రాకకోసం ఎదురు చూస్తున్నామని, గురువారం మధ్యాహ్నం సరయూ నది తీరంలో అంత్యక్రియలు పూర్తి చేస్తామని తదుపరి ప్రధాన అర్చకుడు ప్రదీప్ దాస్ తెలిపారు. సత్యేంద్ర దాస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన జీవితం రాముడి సేవకే అంకితం చేశారని చెప్పారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News