Car accident: ఐర్లాండ్లో కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:22 AM
జనవరి 31 శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని, యువతిని కిల్కెన్నిలోని సెయింట్ లూక్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

లండన్, ఫిబ్రవరి2: దక్షిణ ఐర్లాండ్ ప్రాంతంలో ఉన్న కార్లో కౌంటీలో చెట్టును కారు ఢీ కొని ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను చెరుకూరి సురేశ్ చౌదరి, చిట్టూరి భార్గవ్గా గుర్తించారు. జనవరి 31 శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని, యువతిని కిల్కెన్నిలోని సెయింట్ లూక్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉన్నామని డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రమాదానికి గురైన నలుగురు స్నేహితులు కార్లో లోని సేతు(సౌత్ ఈస్ట్ టెక్నొలాజికల్ యూనివర్సిటీ) విశ్వవిద్యాలయం విద్యార్థులు. నలుగురూ ఒకే ఇంట్లో ఉంటున్నారని అధికారులు తెలిపారు.