Donald Trump : ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:40 AM
యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

గాజా స్వాధీనంలో మా సైన్యం ప్రమేయం ఉండదు: ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 6: యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గాజా పునర్నిర్మాణం జరిగే వరకూ సుమారు 2 లక్షల మంది పాలస్తీనీయులను శరణార్థులుగా స్వీకరించాలంటూ ఇటీవల ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, అరబ్లీగ్, పాలస్తీనా అథారిటీని ట్రంప్ కోరగా.. ఆయా దేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని మంగళవారం ఆయన ప్రకటించారు. ఆ ప్రకటనపైనా అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తమ సైన్యం ప్రమేయం ఉండదంటూ గురువారం ఆయన స్పష్టత ఇచ్చారు.