Pakistan Cuts Gas and Electricity : పాక్లో మన రాయబారులకు గ్యాస్, కరెంట్ కట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:36 AM
పాకిస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్న భారత రాయబారులకు దాయాది దేశం ఇబ్బందులకు గురిచేస్తోంది...
ఇస్లామాబాద్, ఆగస్టు 12: పాకిస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్న భారత రాయబారులకు దాయాది దేశం ఇబ్బందులకు గురిచేస్తోంది. భారత్పై ప్రతీకారాన్ని రాయబారులపై తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కో అంశంలో ఇబ్బందులను పెంచుతూ వస్తోంది. జూన్లో భారత హైకమిషన్, రాయబారుల ఇళ్లకు పత్రికలను నిలిపివేసింది. తాజాగా పాకిస్థాన్లోని రాయబారుల గృహాలకు గ్యాస్, కరెంట్ సరఫరాను ఆపివేసింది.