TCS Partners with TPG: డేటా సెంటర్ వ్యాపారంలో రూ 18,000 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:54 AM
ఐటీ సర్వీసుల దిగ్గజం టీసీఎస్ తాను ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ వ్యాపారంలో సహకారానికి పీఈ కంపెనీ టీపీజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది...
పీఈ సంస్థ టీపీజీతో టీసీఎస్ జట్టు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టీసీఎస్ తాను ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ వ్యాపారంలో సహకారానికి పీఈ కంపెనీ టీపీజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డేటా సెంటర్పై ఉభయ సంస్థలు రూ.18,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. హైపర్వాల్ట్గా నామకరణం చేసిన ఈ డేటా సెంటర్లో టీపీజీ రూ.8870 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 27.5 నుంచి 49ు మధ్యలో వాటా కలిగి ఉంటుంది. ఈ తరహా డేటా సెంటర్ ద్వారా కస్టమర్లు, భాగస్వాములకు సంపూర్ణంగా ఏఐ సొల్యూషన్లు అందించగలుగుతామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News