దారికొస్తున్న పన్ను చెల్లింపుదారులు
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:42 AM
భారతీయుల విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయ వివరాలు కక్కించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఏడాది ...

రూ.29,000 కోట్ల విదేశీ ఆస్తుల వెల్లడి
న్యూఢిల్లీ: భారతీయుల విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయ వివరాలు కక్కించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 17 నుంచి ఐటీ శాఖ ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 19,501 మందికి ఎస్ఎంఎ్సలు, ఈ-మెయిల్స్ పంపించింది. వెంటనే మీ అసలు విదేశీ ఆస్తులు, ఆదాయాలకు అనుగుణంగా ఐటీ రిటర్న్లు ఫైల్ చేయాలని కోరింది. దీంతో 2024-25 అసె్సమెంట్ ఇయర్కు సంబంధించి 24,678 మంది తమ పన్ను రిటర్న్లను సమీక్షించుకోవటంతో పాటు మరో 5,483 మంది ఆలస్యంగా రూ.29,208 కోట్ల అదనపు విదేశీ ఆస్తులు, ఆదాయం వెల్లడిస్తూ కొత్త ఐటీ రిటర్న్లు దాఖలు చేశారు. మరో 6,734 మంది తమ నివాస హోదాను రెసిడెంట్ నుంచి నాన్-రెసిడెంట్ స్థాయికి మార్చుకున్నారు.
Read More Business News and Latest Telugu News