Share News

స్కోడా గ్రూపుతో టాటా ఆటోకాంప్‌ జేవీ

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:28 AM

రైల్వేలకు అవసరమైన అధునాతన యంత్రపరికరాలు, విడి భాగాల తయారీ కోసం టాటా గ్రూప్‌ చెక్‌ రిపబ్లిక్‌కు చెదిన స్కోడా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఇందుకోసం...

స్కోడా గ్రూపుతో టాటా ఆటోకాంప్‌ జేవీ

న్యూఢిల్లీ : రైల్వేలకు అవసరమైన అధునాతన యంత్రపరికరాలు, విడి భాగాల తయారీ కోసం టాటా గ్రూప్‌ చెక్‌ రిపబ్లిక్‌కు చెదిన స్కోడా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఇందుకోసం ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీని ఏర్పాటు చేసినట్టు టాటా ఆటోకాంప్‌ తెలిపింది. ఈ జేవీ ద్వారా రైలు ఇంజిన్లు, కోచ్‌లు, అవసరమైన ఇతర కీలక విడి భాగాలనూ భారత్‌లో తయారు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ జేవీ కోసం పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. భారత్‌లో పెరుగుతున్న రైలు రవాణాను దృష్టిలో ఉంచుకుని స్కోడా గ్రూప్‌తో కలిసి ఈ జేవీ ఏర్పాటు చేసినట్టు టాటా ఆటోకాంప్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:28 AM