Share News

నీరసించిన స్టాక్‌ మార్కెట్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:25 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నీరసించింది. సెన్సెక్స్‌ 176.43 పాయింట్ల నష్టంతో 93,536.08 వద్ద ముగియగా నిఫ్టీ 46.40 పాయింట్ల నష్టంతో 25,476.10 వద్ద ముగిసింది...

నీరసించిన స్టాక్‌ మార్కెట్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నీరసించింది. సెన్సెక్స్‌ 176.43 పాయింట్ల నష్టంతో 93,536.08 వద్ద ముగియగా నిఫ్టీ 46.40 పాయింట్ల నష్టంతో 25,476.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఒక దశలో 330.23 పాయింట్ల వరకు నష్టపోయి 83,382.28 పాయింట్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకింది. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం బుధవారం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయోననే భయాలూ మార్కెట్‌ను వెంటాడాయి.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:25 AM