Share News

విశాఖలో రెండో ప్లాంట్‌ షురూ

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:36 AM

మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సల్ఫర్‌ తయారీ సామర్థ్యాలు రెట్టింపు చేయాలని లక్ష్యంగా...

విశాఖలో రెండో ప్లాంట్‌ షురూ

సల్ఫర్‌ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలు పెంపు

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మురుగప్పా గ్రూప్‌నకు చెందిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సల్ఫర్‌ తయారీ సామర్థ్యాలు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో రెండో తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో సల్ఫర్‌ తయారీ సామర్థ్యాన్ని 50 వేల మెట్రిక్‌ టన్నులకు చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు అత్యధిక నాణ్యత గల బెంటోనైట్‌ సల్ఫర్‌ను నిలకడగా సరఫరా చేయాలనుకుంటున్నామని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌ శంకరసుబ్రమణియన్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన ముడిసరుకు సరఫరాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ ప్లాంట్‌ ఫాస్ఫారిక్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌తో పాటు 12 ఎల్‌ఎంటీ కాంప్లెక్స్‌ ఎరువులు తయారుచేస్తుందని ఆయన చెప్పారు. రాబోయే 4-5 ఏళ్ల కాలంలో బెంటోనైట్‌ సల్ఫర్‌ ఎరువులకు పెరిగే డిమాండ్‌ను ఈ ప్లాంట్‌ తీరుస్తుంది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 07 , 2025 | 06:36 AM