Retail Inflation Rises: మళ్లీ ధరలు సుర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:06 AM
ద్రవ్యోల్బణం మరోసారి ఊర్థ్వముఖ చలనం ప్రారంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్ల ధరలు పెరగడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం జూలైలో 1.61%, గత ఏడాది...
ఆగస్టు ద్రవ్యోల్బణం 2.07%
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం మరోసారి ఊర్థ్వముఖ చలనం ప్రారంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్ల ధరలు పెరగడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం జూలైలో 1.61%, గత ఏడాది ఆగస్టులో (-) 0.69% ఉంది. 9 నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన వినియోగదారుల ధరల సూచీ ఆగస్టులో తొలిసారి ఎగువకు కదిలింది. అయితే ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4ు (2 శాతం ఎగువకు లేదా దిగువకు సద్దుబాటుతో)లోపే ఉంది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 1.18% నుంచి 1.69 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.1% నుంచి 2.47 శాతానికి పెరిగింది. రాష్ట్రాలవారీగా చూస్తే కేరళలో గరిష్ఠంగా9.04ు ఉండగా అసోమ్ లో కనిష్ఠంగా -0.66% ఉంది. ఆహార, ఇంధన విభాగాలు మినహా ఇతర విభాగాల్లో ద్రవ్యోల్బణం 4.3 శాతంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News