Share News

RBI Issues New Guidelines: మరణించిన వ్యక్తుల ఖాతాల సత్వర సెటిల్‌మెంట్‌

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:49 AM

మరణించిన ఖాతాదారుల బ్యాంక్‌ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్‌మెంట్‌ ప్రక్రియను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌...

RBI Issues New Guidelines: మరణించిన వ్యక్తుల ఖాతాల సత్వర సెటిల్‌మెంట్‌

బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్‌బీఐ

ముంబై: మరణించిన ఖాతాదారుల బ్యాంక్‌ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్‌మెంట్‌ ప్రక్రియను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సులభతరం చేసింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది.

  • చనిపోయిన వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలోని మొత్తాన్ని నామినీకి, జాయింట్‌ ఖాతా అయితే సర్వైవర్‌కు చెల్లించాలి

  • ఒకవేళ ఖాతాదారు ఎవరినీ నామినీగా పేర్కొనక పోయినా, డిపాజిట్‌ మొత్తం నిర్ణీత మొత్తానికి లోబడి ఉంటే, బ్యాంకులు ఆ మొత్తాన్ని సులభతర పద్దతిలో సెటిల్‌ చేయాలి

  • సహకార బ్యాంకులైతే రూ.5 లక్షల లోపు, ఇతర బ్యాంకులైతే రూ.15 లక్షలను గరిష్ఠ పరిమితిగా పెట్టుకోవాలి.

  • బ్యాంకుల బోర్డులు అనుమతిస్తే ఇంతకు మించిన మొత్తాన్ని కూడా అనుమతించవచ్చు

  • అయితే ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడనే సర్టిఫికెట్లు తీసుకోవాలి

  • చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్‌ అందిన 15 రోజుల్లోగా సెటిల్‌మెంట్‌ పూర్తి చేయాలి

  • 15 రోజుల్లోగా క్లెయిమ్‌ సెటిల్‌ చేయలేకపోతే అందుకు కారణాలు ఏమిటో నామినీ, చట్టబద్ద వారసులకు తెలియజేయాలి

  • సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై బ్యాంక్‌ అమలు చేస్తున్న వడ్డీకి తోడు 4ు వార్షిక వడ్డీ చెల్లించాలి.

  • లాకర్‌లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి.

ఇవి కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 05:49 AM