ఆర్బీఐ వద్ద 880 టన్నుల పసిడి
ABN , Publish Date - May 06 , 2025 | 04:47 AM
ఆర్బీఐ కూడా పెద్ద ఎత్తున పసిడి కొనుగోలు చేస్తోంది. గత ఆర్థిక సంత్సరం 57 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. గత ఏడేళ్లలో ఆర్బీఐ ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో...
ముంబై: ఆర్బీఐ కూడా పెద్ద ఎత్తున పసిడి కొనుగోలు చేస్తోంది. గత ఆర్థిక సంత్సరం 57 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. గత ఏడేళ్లలో ఆర్బీఐ ఎన్న డూ ఇంత పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేయలే దు. ఇందులో 25 టన్నులు 2024 సెప్టెంబరు-2025-మార్చి మధ్య కొనుగోలు చేసింది. దీంతో గత నెలాఖరు నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న పసిడి నిల్వలు 879.59 టన్నులకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24.86 టన్నులు ఎక్కువ. దీంతో ఆర్బీఐ మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా గత నెలాఖరుకు 11.70 శాతానికి చేరింది.
ఇవి కూడా చదవండి:
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News