ఇక జీఎ్సటీ రేట్ల హేతుబద్దీకరణ !
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:55 AM
జీఎ్సటీ రేట్లనీ హేతుబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు అధికార వర్గాలు చెప్పాయి...

న్యూఢిల్లీ: జీఎ్సటీ రేట్లనీ హేతుబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు అధికార వర్గాలు చెప్పాయి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రుల బృందం (జీఓఎం) దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తోంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే వ్యక్తులకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు. దాంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుల భారం తగ్గేలా పన్నుల శ్లాబులనీ సవరించారు. జీఎ్సటీ రేట్ల హేతుబద్దీకరణ విషయంలోనూ ఇదే పద్దతి అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకోవాలని యోచిస్తున్నట్టు భావిస్తున్నారు. త్వరలో జరిగే జీఎస్టీ మండలి సమావేశం ఇందుకు వేదిక అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జీఎ్సటీ ఆదాయాలకు గండి పడకుండా, మధ్య తరగతి ప్రజలపై పన్ను పోటు తగ్గేలా ఈ హేతుబద్దీకరణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News