Share News

మరింత కట్టుదిట్టంగా ఈక్విటీ డెరివేటివ్స్‌:సెబీ

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:38 AM

ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలతో ఒక చర్చా పత్రం విడుదల చేసింది..

మరింత కట్టుదిట్టంగా ఈక్విటీ డెరివేటివ్స్‌:సెబీ

న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలతో ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ఈ చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు వచ్చే నెల 17వ తేదీలోగా తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ఎఫ్‌ అండ్‌ ఓ, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ (ఓఐ) విభాగాల్లో ట్రేడింగ్‌ సామర్ధ్యం, వెసులుబాటు పెంచడం, రియల్‌ టైమ్‌ సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు నష్ట భయ (రిస్క్‌) పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేసే కృషిలో భాగంగా సెబీ ఈ చర్చా పత్రం విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఎఫ్‌ అండ్‌ ఓ, ఓఐ పొజిషన్లపై మదుపరులు రియల్‌ టైమ్‌ సమాచారం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీనికి తోడు నష్టభయాలను సమర్ధవంతంగా నిర్వహించుకోవడంతో పాటు మేలైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు


Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:38 AM