Share News

సీనియర్‌ సిటిజన్లకు ఐఆర్‌డీఏఐ ఊరట

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:49 AM

సీనియర్‌ సిటిజన్లకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ పెద్ద ఊరట కల్పించింది. బీమా కంపెనీలు వీరికి ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం...

సీనియర్‌ సిటిజన్లకు ఐఆర్‌డీఏఐ ఊరట

ఏటా ప్రీమియం పెంపు 10% మించొద్దు

న్యూఢిల్లీ: సీనియర్‌ సిటిజన్లకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ పెద్ద ఊరట కల్పించింది. బీమా కంపెనీలు వీరికి ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం పెంపు ఏటా 10 శాతం మించకూడదని స్పష్టం చేసింది. అంతకు మించితే ముందుగా తమ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాన్ని బీమా కంపెనీలు ఏటా ఎడాపెడా పెంచుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ చర్య తీసుకుంది. ఈ పాలసీల ప్రీమియం కూడా క్లెయిమ్‌ల ద్వారా చెల్లించే మొత్తం, ఖర్చుల ఆధారంగా ఉండాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 02:50 AM