Share News

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:15 PM

ఉదయం భారీ నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు పుంజుకున్నాయి. చివరకు ఓ మోస్తరు నష్టాలతో రోజును ముగించాయి.

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే
Stock Market

ఉదయం భారీ నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు పుంజుకున్నాయి. చివరకు ఓ మోస్తరు నష్టాలతో రోజును ముగించాయి. చైనా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు ఉన్నాయని వార్తలు రావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (84, 778)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 150 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఒక దశలో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా కోల్పోయి 84, 219 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల నుంచి రికవరీ అయింది. చివరకు 150 పాయింట్ల నష్టంతో 84, 628 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 29 పాయింట్ల నష్టంతో 25, 936 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో సుజ్‌లాన్ ఎనర్జీ, జిందాల్ స్టీల్, ఇండస్ టవర్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). వోడాఫోన్ ఐడియా, సుప్రీమ్ ఇండస్ట్రీస్, బీఎస్‌ఈ లిమిటెడ్, టొరెంట్ పవర్, అదానీ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 14 పాయింట్ల స్వల్ప నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 99 పాయింట్ల లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.27గా ఉంది.


ఇవీ చదవండి:

ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు

అమెరిజాన్‌లో భారీ స్థాయిలో తొలగింపులకు రంగం సిద్ధం.. 30 వేల మందిపై వేటు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 28 , 2025 | 04:15 PM