Share News

Indian Stock Market: నాలుగో రోజూ నష్టాల్లోనే

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:02 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో 540 పాయింట్లకు పైగా...

Indian Stock Market: నాలుగో రోజూ నష్టాల్లోనే

సెన్సెక్స్‌ మరో 78 పాయింట్లు డౌన్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో 540 పాయింట్లకు పైగా శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్‌.. చివరికి 77.84 పాయింట్ల నష్టంతో 84,481.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 25,815.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రెండ్‌తో పాటు అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 17 నష్టపోగా.. సన్‌ఫార్మా షేరు 2.77 శాతం క్షీణించింది.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి రూ.90.20 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడినప్పటికీ, ఆర్‌బీఐ జోక్యంతో రూపాయికి మద్దతు లభించింది.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 03:02 AM