Share News

ఐటీ రిటర్నుల గడువు జూలై 31

ABN , Publish Date - May 13 , 2025 | 03:18 AM

మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎప్పటిలా ఈ ఏడాది కూడా జూలై 31గా...

ఐటీ రిటర్నుల గడువు జూలై 31

ఏడు రకాల రిటర్న్‌ ఫారాల విడుదల

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎప్పటిలా ఈ ఏడాది కూడా జూలై 31గా నిర్ణయించింది. అసె్‌సమెంట్‌ ఇయర్‌ (ఏవై) 2025-26కు సంబంధించి ఏడు రకాల ఐటీ రిటర్న్‌ ఫారాలను విడుదల చేసింది.

  • లిస్టెడ్‌ కంపెనీల షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో వార్షిక దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ) రూ.1.25 లక్షల వరకు ఉన్న చిన్న,మధ్య రకం పన్ను చెల్లింపుదారులు ఇకపై ఎలాంటి పన్ను పోటు లేకుండా ఐటీఆర్‌-2కు బదులుగా ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 ఫారాల్లో తమ రిటర్నులు దాఖలు చేయాలి.

  • ఎల్‌టీసీజీ రూ.1.25 లక్షలు మించితే మాత్రం 12.5 శాతం పన్ను చెల్లించాలి.

  • ట్రస్టులు, ధార్మిక సంస్థలు ఐటీఆర్‌-7 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి.

  • ఐటీఆర్‌-2,3,5,6,7 ఫారాల్లో పేర్కొనే మూలధన లాభాలను హేతుబద్దం చేశారు. ఇండెక్సేషన్‌ ప్రయోజనం కావాలనుకుంటే 20 శాతం, వద్దనుకుంటే 12.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 03:18 AM