Hyderabad Entrepreneurship Summit: 31 నుంచి హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సు
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:03 AM
ఈ నెల 31 నుంచి హైటెక్స్లో ‘హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సు’ జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 500 స్టార్టప్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయని...
హైదరాబాద్: ఈ నెల 31 నుంచి హైటెక్స్లో ‘హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సు’ జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 500 స్టార్టప్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయని ‘టై’ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల చెప్పారు. వీటికి తోడు ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు, పరిశ్రమల నుంచి 1,500 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులో కనీసం 50 స్టార్టప్ కంపెనీలకు వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరే అవకాశం ఉందని రాజేశ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News