Government Housing Fund Scheme: రూ.15,000 కోట్లతో స్వామిహ్ 2 ఫండ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:45 AM
వివిధ కారణాలతో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం...
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.15,000 కోట్ల నిధులతో ‘స్వామిహ్-2’ పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.1,500 కోట్లు ప్రారంభ మూలధనంగా కేటాయించింది. ఈ ప్రత్యేక నిధి నుంచి దాదాపు లక్ష నివాస గృహా యూనిట్ల పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే రెరా అనుమతి ఉన్న గృహ ప్రాజెక్టులకు మాత్రమే లభిస్తాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..