టెక్ పయనీర్స్ జాబితాలో ఈక్వల్
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:25 AM
స్థానిక సెక్యూర్ డేటా షేరింగ్ ప్లాట్ఫాం ‘ఈక్వల్’కు అరుదైన గౌరవం లభించింది. డబ్ల్యుఈఎఫ్ 2025...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : స్థానిక సెక్యూర్ డేటా షేరింగ్ ప్లాట్ఫాం ‘ఈక్వల్’కు అరుదైన గౌరవం లభించింది. డబ్ల్యుఈఎఫ్ 2025 సంవత్సరానికి రూపొందించిన టెక్నాలజీ పయనీర్స్ జాబితాలో చోటు దొరికింది. ఈ జాబితాలో గూగుల్, స్పాటిఫై వంటి దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వంద కంపెనీలకు చోటు సంపాదించాయి. ఇందులో 10 శాతం అంటే పది మన దేశానికి చెందిన స్టార్టప్ కంపెనీలు కావడం విశేషం. డబ్ల్యుఈఎఫ్ జాబితాలో చోటు దొరకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు ఈక్వల్ వ్యవస్థాపకులు కేశవ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి