Cyber Pearl Hyderabad: అమ్మకానికి హైదరాబాద్ సైబర్ పెరల్
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:26 AM
ప్రముఖ ప్రాపసర్టీ ట్రస్ట్ క్యాపిటల్ల్యాండ్ ఇండియా ట్రస్ట్ (క్లింట్) చెన్నై, హైదరాబాద్ల్లోని తన రెండు వాణిజ్య ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఈ రెండు ఆస్తులను రూ.1,103 కోట్లకు...
క్యాపిటల్ల్యాండ్ ఇండియా ట్రస్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రాపసర్టీ ట్రస్ట్ క్యాపిటల్ల్యాండ్ ఇండియా ట్రస్ట్ (క్లింట్) చెన్నై, హైదరాబాద్ల్లోని తన రెండు వాణిజ్య ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ఈ రెండు ఆస్తులను రూ.1,103 కోట్లకు విక్రయించేందుకు ఇప్పటికే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలోని సైబర్పెరల్, చెన్నైలోని సైబర్వేల్ టవర్లు ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. 2007లో సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన తర్వాత క్లింట్ ఆస్తులను అమ్మడం ఇదే మొదటిసారి. అనేక ఐటీ, బీఎ్ఫఎ్సఐ కంపెనీలు కొలువు తీరిన ఈ రెండు వాణిజ్య ఆస్తుల విస్తీర్ణం 14 లక్షల చదరపు అడుగులు (ఎస్ఎ్ఫటీ)గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పెంపుడు కుక్క ఎంత పని చేసింది.. పెద్దలు ఇంట్లో లేని సమయంలో దారుణం..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..