Share News

బడ్జెట్‌తో తగ్గిన నిబంధనల భారం

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:42 AM

కేంద్ర బడ్జెట్‌ మధ్యతరగతితో పాటు కార్పొరేట్‌ రంగాన్నీ మెప్పిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అనేక పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు. టీడీఎ్‌సతో పాటు టీసీఎస్‌ చెల్లింపులను...

బడ్జెట్‌తో తగ్గిన నిబంధనల భారం

ఊపిరి పీల్చుకుంటున్న కంపెనీలు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ మధ్యతరగతితో పాటు కార్పొరేట్‌ రంగాన్నీ మెప్పిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అనేక పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు. టీడీఎ్‌సతో పాటు టీసీఎస్‌ చెల్లింపులను సులభతరం చేశారు. స్టార్టప్‌ కంపెనీలకూ పన్ను విరామాలు ప్రకటించారు. ఈ చర్యలతో సులభతర వాణిజ్యం మరింత ఊపందుకుంటుందని కార్పొరేట్‌ రంగం అంచనా. కార్పొరేట్‌ రంగానికి సంబంధించి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన మార్పులు ఏమిటంటే..

  • స్టార్టప్‌ కంపెనీలకు తొలి 10 ఏళ్లలో మూడేళ్ల పాటు ట్యాక్స్‌ బ్రేక్‌పలు లభిస్తాయి.

  • విలీనాలతో ఏర్పడే కొత్త కంపెనీలకు మాత్రమే మిగతా కాలానికి.. గత నష్టాలను క్యారీ ఫార్వర్డ్‌ సదుపాయం లభిస్తుంది.

  • అద్దెలు, టెక్నికల్‌ సర్వీసులపై చెల్లించే టీడీఎ్‌స/టీసీఎస్‌ కనీస పరిమితులు పెంచారు. దీంతో కంపెనీలకు చిన్న చిన్న లావాదేవీలపై కంప్లయన్స్‌ భారం తగ్గింది.

  • వస్తువుల అమ్మకాల విలువ రూ.50 లక్షలు మించినప్పుడు చెల్లించే టీడీఎస్‌, టీసీఎస్‌ మొత్తాన్ని 0.1 శాతానికి పరిమితం చేశారు.


  • జీఎ్‌సటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయని వారిపై విఽధించే అదనపు 20 శాతం టీడీఎ్‌స/టీడీఎ్‌సను రద్దు చేశారు.

  • టీసీఎస్‌ చెల్లింపులు ఆలస్యమైనా రిటర్న్‌లు సకాలంలో ఫైల్‌ చేసే కంపెనీలు, వ్యాపార సంస్థలపై ఇక కేసులు నమోదు చేయరు.

  • అప్‌డేటెడ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు ఫైల్‌ చేసే గడువు. రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంపు. కాకపోతే మూడో సంవత్సరంలో ఫైల్‌ చేస్తే 60 శాతం, నాలుగో ఏడాది ఫైల్‌ చేస్తే 70 శాతం అదనంగా చెల్లించాలి.

  • కంపెనీలు ఒకే ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ విధానాన్ని మూడేళ్ల వరకు కొనసాగించవచ్చు. దీంతో రిలేటెడ్‌ పార్టీ లావాదేవీలతో ఏర్పడే వివాదాలు తగ్గుముఖం పడతాయని భావించ వచ్చు.

  • కేసు ప్రొసీడింగ్స్‌ ప్రారంభమైన ఆరు నెలల లోపు పన్ను వసూలు అధికారులు పెనాల్టీ ఆర్డర్లు పాస్‌ చేయాలి.

  • భారత ఎలకా్ట్రనిక్‌ కంపెనీలకు సాంకేతిక సేవలు అందించే విదేశీ సంస్థలు, వ్యక్తులు ఇక తమ మొత్తం ఆదాయంలో 25 శాతం పన్నుగా చెల్లిస్తే సరిపోతుంది.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..


Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక


RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 03 , 2025 | 06:42 AM