అందరి చూపూ ఆర్బీఐ వైపే
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:24 AM
మధ్యతరగతి ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అందరూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వైపే ఆశగా చూస్తున్నారు. సుమారుగా ఐదేళ్ల నుంచి వడ్డీ రేట్ల భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న తమకు...

ముంబై: మధ్యతరగతి ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అందరూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వైపే ఆశగా చూస్తున్నారు. సుమారుగా ఐదేళ్ల నుంచి వడ్డీ రేట్ల భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న తమకు కనీసం ఈ సారైనా ఊరట లభిస్తుందా అన్నదే అందరిలోనూ ఉత్సుకత. తన సారథ్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం ప్రకటించనున్నారు. అంతర్జాతీయ, దేశీయ రేటింగ్ ఏజెన్సీలన్నీ కూడా ఈ పాలసీలో రెపో రేటు పావు శాతం కోత ఉంటుందని అంచనా వేస్తున్నాయి. 2020 మే నెలలో ఆర్బీఐ చిట్టచివరిగా రెపో రేటును 0.40 శాతం తగ్గించింది.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News