Share News

ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్‌’ ఆఫర్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:53 AM

ఎయిరిండియా ‘‘నమ స్తే వరల్డ్‌’’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని రకా ల క్లాస్‌లకు ఇది వర్తిస్తుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ టికెట్ల విక్రయం...

ఎయిరిండియా ‘నమస్తే వరల్డ్‌’ ఆఫర్‌

రూ.1,499కే విమాన టికెట్‌

న్యూఢిల్లీ: ఎయిరిండియా ‘‘నమ స్తే వరల్డ్‌’’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని రకా ల క్లాస్‌లకు ఇది వర్తిస్తుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ టికెట్ల విక్రయం గురువారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టికెట్లపై కస్టమర్లు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ మధ్యలో తమకు అనుకూలమైన ఏ తేదీల్లో అయినా ప్రయాణించవచ్చు. విదేశీ గమ్యాలను ఎంచుకునే వారు విదేశీ కరెన్సీలో కూడా చెల్లింపులు చేయవచ్చు. దేశీయంగా ఎకానమీ క్లాస్‌ ధర రూ.1,499, ప్రీమియం ఎకానమీ ధర రూ.3,749, బిజినెస్‌ క్లాస్‌ ధర రూ.9,999గా నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ గమ్యాలకు ఎకానమీ క్లాస్‌ రూ.12,577, ప్రీమియం ఎకానమీ క్లాస్‌ రూ.16,213, బిజినెస్‌ క్లాస్‌ ధర రూ.20,870గా ప్రకటించింది.


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 03 , 2025 | 06:53 AM