టీడీపీ సభ్యత్వాల్లో పాలకొల్లు టాప్
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:25 AM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగింది. జిల్లాలో ఉన్న ఓటర్లలో నాలుగో వంతుమంది తెలుగుదేశం సభ్యులుగా చేరారు. జిల్లా పరిఽధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాలకొల్లు ప్రథమ స్థానంలో నిలచింది. రాష్ట్ర స్థాయి రికార్డులను బ్రేక్ చేసేలా సభ్యత్వాలు నమోదయ్యాయి.
రికార్డు స్థాయిలో నమోదు
జిల్లాలో 30శాతం మంది తెలుగుదేశం సభ్యులే
పాలకొల్లు, ఉండిలో రికార్డులు బ్రేక్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగింది. జిల్లాలో ఉన్న ఓటర్లలో నాలుగో వంతుమంది తెలుగుదేశం సభ్యులుగా చేరారు. జిల్లా పరిఽధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాలకొల్లు ప్రథమ స్థానంలో నిలచింది. రాష్ట్ర స్థాయి రికార్డులను బ్రేక్ చేసేలా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉండి నియోకవర్గం నిలిచింది. ఓటర్లలో దాదాపు మూడో వంతు మంది వంతుమంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాదిరిగా కేవలం రశీదులు ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. సభ్యత్వం తీసుకున్న వారు ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంది. దాంతో ఇష్టం ఉన్న వారే తెలుగుదేశం సభ్యత్వం తీసుకునే విధంగా పార్టీ ఆదేశాలు జారీచేసింది. నియోజకవర్గ బాధ్యులు అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి పనిచేశారు. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది సభ్యత్వాన్ని తీసుకుంటే ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు 4.90 లక్షల మంది తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వంలో చేరారు. తెలుగుదేశం పార్టీ బీమా సౌకర్యం కూడా కల్పించింది. అన్ని వర్గాలనుంచి స్పందన లభించింది. కేడర్ కూడా పట్టుదలతో సభ్యత్వనమోదుకు కృషి చేసింది. ప్రభుత్వం ఏర్పడినా సరే సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటూ జిల్లాలోని కొన్ని నియోకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురంలో ఈ సారి నాయకత్వంలోనూ, కేడర్లోనూ కాస్త అసంతృప్తి ఉంది. మూడు నియోకవర్గాల్లో కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. అయితే నామినేటె డ్ పదవుల విషయంలోనూ ప్రధాన్యం లభించలేదు. అయినా సరే సభ్యత్వ నమోదులో నియోజకవర్గ బాధ్యులు తమ వంతు కృషి చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం కూడా నియోజకవర్గాల వారీగా అప్రమత్తం చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసింది.
మూడవ వంతు సభ్యత్వం
జిల్లాలో 14,70,852 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4,90,182 మంది సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే దాదాపు 33శాతం మంది ఓటర్లు తెలుగుదేశం సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ చరిత్రలో ఇంతలా సభ్యత్వ నమోదు కావడంపై పార్టీ శ్రేణుల్లోనూ జోష్ నెలకొంది. పార్టీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉండడంతో ఇది సాధ్యపడింది.
రికార్డుల బ్రేక్..
పాలకొల్లు నియోజకవర్గంలో ఈసారి సభ్యత్వ నమోదుకు పోటీ పడ్డారు. ఇక్కడ 1,94,913మంది ఓటర్లున్నారు. దాదాపు 75 శాతం మంది ఓటర్లు సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే 1,49,458 మంది ఓటర్లు పాలకొల్లు నియోజకవర్గంలో సభ్య త్వం పొందారు. రాష్ట్ర స్థాయిలోనే పాలకొల్లు నియోజకవర్గం రికార్డులు బ్రేక్ చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రణాళిక అక్కడ బాగా పనిచేసింది. ఆ తర్వాత ఉండి నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వాలు తీసుకున్నారు. ఉండిలో 1,21,552మంది సభ్యత్వం పొందారు. అక్కడ 60 శాతం మంది ఓటర్లు తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న వారిలో ఉన్నారు. రెండు నియోజకవర్గాలు ఈసారి గట్టి పోటీ పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేని భీమ వరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోకజవర్గాల్లోనూ మునుపెన్నడూ లేని విధంగా సభ్యత్వాలు నమోదు చేశారు. తణుకు, ఆచంట నియోకవర్గంలో ఈ సారి పక్కా ప్రణా ళికతో ముందుకు వెళ్లారు. మొత్తంపైన అధిష్ఠానం ఆకాం క్షలకు అనుగుణంగా జిల్లాలో సభ్యత్వాలు నమోదు కావడ ంతో నాయకత్వం , కేడర్ మంచి జోష్ మీద ఉంది.
సభ్యత్వ నమోదు ఇలా
పాలకొల్లు –1,49,458
ఉండి – 1,21,552
తణుకు – 62,618
ఆచంట – 44610
భీమవరం – 41208
తాడేపల్లిగూడెం – 38018
నరసాపురం –32718