ఎమ్మెల్సీ నామినేషన్లు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:43 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం శుక్రవారం 15 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లను జిల్లా ఎన్నికల అఽధికారి కె వెట్రిసెల్వికి సమర్పించారు.

ఏలూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి) : తూర్పు– పశ్చిమ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం శుక్రవారం 15 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లను జిల్లా ఎన్నికల అఽధికారి కె వెట్రిసెల్వికి సమర్పించారు. గురువారం నాటికి 5 నామినేషన్లు దాఖలు కాగా, ఈ సంఖ్య 20కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లను వేశారు.