Share News

చత్తీస్‌ఘడ్‌ బదిలీ చేయడం తగదు

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:51 PM

కర్లాం లోని వెంకటరామ పౌలీ్ట్రస్‌ లో పనిచేస్తున్న 25మంది మహిళాకార్మికులను యా జమాన్యం అన్యాయంగా చత్తీస్‌ఘడ్‌ బదిలీ చేయ డం తగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంబల్ల గౌరినాయుడు పేర్కొన్నారు.

చత్తీస్‌ఘడ్‌ బదిలీ చేయడం తగదు
ధర్నా చేస్తున్న మహిళా కార్మికులు:

చీపురుపల్లి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కర్లాం లోని వెంకటరామ పౌలీ్ట్రస్‌ లో పనిచేస్తున్న 25మంది మహిళాకార్మికులను యా జమాన్యం అన్యాయంగా చత్తీస్‌ఘడ్‌ బదిలీ చేయ డం తగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంబల్ల గౌరినాయుడు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళా కార్మికులకు మరిచిపోలేని బహుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు కోళ్ల పరిశ్రమ వద్ద మహిళా కార్మికులు నిరసన తెలిపా రు.ఈసందర్భంగా మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితంలేదని తెలిపారు. సమస్యయ పరిష్కారమయ్యే వరకూ ధర్నా కొనసా గుతుందని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకుడు ఇప్పిలి గురునాయు డు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:51 PM