Rachabanda రచ్చబండ చదువులు
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:30 AM
రావివలసలోని ప్రాథమిక పాఠశాలకు వసతి సమస్య వేధిస్తోంది. దీంతో విద్యార్థులు రచ్చబండపై పాఠాలు నేర్చుకోవలసి వస్తోంది.

గరుగుబిల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రావివలసలోని ప్రాథమిక పాఠశాలకు వసతి సమస్య వేధిస్తోంది. దీంతో విద్యార్థులు రచ్చబండపై పాఠాలు నేర్చుకోవలసి వస్తోంది. ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సరైన భవనాలు లేక సోమవారం రచ్చబండపై బోధించాల్సి వచ్చింది. ఒకవైపు చలితో ఇబ్బంది పడుతూనే విద్యార్థులు చదువుకోవలసి వచ్చింది. సంబంధిత అధికారులు దృష్టి సారించి పూర్తి స్థాయిలో బోధనకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా... సీమలవానివలస, కారివలస గ్రామాల్లో భవనాలు శిథిలం కావడంతో వరండాల్లో, పశువుల శాలల్లో బోధిస్తున్నారు. అధికారులు ఈ పాఠశాలల్లోనూ వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.