Share News

Kanaka Mahalakshmi మార్చి 2 నుంచి కనక మహాలక్ష్మి జాతర

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:30 AM

చీపురుపల్లి పట్టణంలో వెలసిన శ్రీకనక మహలక్ష్మి అమ్మవారి జాతరను మార్చి 2, 3, 4 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ నిర్ణయించింది.

Kanaka Mahalakshmi మార్చి 2 నుంచి  కనక మహాలక్ష్మి జాతర
కనక మహాలక్ష్మి అమ్మవారు

చీపురుపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణంలో వెలసిన శ్రీకనక మహలక్ష్మి అమ్మవారి జాతరను మార్చి 2, 3, 4 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ నిర్ణయించింది. శివరాత్రి అనంతరం వచ్చే తొలి ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు మార్చి 2 నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. ఈ జాతర నిర్వహణ కోసం ఇటీవల కమిటీని నియమించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిడి నాగరాజు నేతృత్వంలో ఈ కమిటీ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Jan 28 , 2025 | 12:36 AM