డంపింగ్ యార్డులో మంటలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:12 AM
జిల్లా కేంద్ర శివారుల్లో గల డంపింగ్ యార్డులో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి.

పార్వతీపురంటౌన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర శివారుల్లో గల డంపింగ్ యార్డులో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. మున్సిపల్ అధికారులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల వరకు మంటల ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడే ఇలా మంటలు రావడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.