Share News

District Voters జిల్లా ఓటర్లు.. 7.84 లక్షలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:15 AM

District Voters: 7.84 Lakhs జిల్లాలో తాజాగా ఓటర్ల సంఖ్య 7,84,104గా నమోదైంది. సోమవారం సాయంత్రం ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను విడుదల చేసింది.

 District Voters జిల్లా ఓటర్లు.. 7.84 లక్షలు

పార్వతీపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాజాగా ఓటర్ల సంఖ్య 7,84,104గా నమోదైంది. సోమవారం సాయంత్రం ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను విడుదల చేసింది. గత ఏడాది నవంబరు 29 నాటికి ‘మన్యం’లో సర్వీస్‌ ఓటర్లు 2,217 మంది కాగా మిగిలిన ఓటర్లు 7,83,964 మందిగా ఉన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ప్రకారం.. సర్వీస్‌ ఓటర్లు 2,209 , మిగిలిన వారు 7,81,895 మందిగా నమోదయ్యారు. మొత్తంగా 7,84,104 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. పాలకొండలో పురుష ఓటర్లు 95056, మహిళా ఓటర్లు 100219, ఇతరులు 15 మంది, సర్వీస్‌ ఓటర్లు 651 మంది ఉన్నారు. కురుపాంలో మహిళా ఓటర్లు 10,0130, పురుష ఓటర్లు 94,618, ఇతరులు 42 మంది, సర్వీస్‌ ఓటర్లు 498 మంది ఉన్నారు. పార్వతీపురంలో పురుష ఓటర్లు 93,791, మహిళా ఓటర్లు 96,572 ఇతరులు 11 మంది, సర్వీస్‌ ఓటర్లు 671 మంది ఉన్నారు. సాలూరులో పురుష ఓటర్లు 98,189 మంది , మహిళా ఓటర్లు 1,03,248 మంది, ఇతరులు నలుగురు, సర్వీస్‌ ఓటర్లు 389 మంది ఉన్నారు. గతంతో పోల్చుకుంటే జిల్లాలో 2,080 మంది ఓటర్లు తగ్గారు.

Updated Date - Jan 07 , 2025 | 12:15 AM