వైభవంగా చక్రతీర్థ స్నానం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:31 AM
తోటపల్లిలో స్వామివారికి బుధవారం వైభవంగా శ్రీచక్ర తీర్థ స్నానాలను నిర్వహించారు.

గరుగుబిల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్ర జ్యోతి): తోటపల్లిలో స్వామివారికి బుధవారం వైభవంగా శ్రీచక్ర తీర్థ స్నానాలను నిర్వహించారు. వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు వీవీ అప్పలాచార్యు లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన దేవస్థానాల ప్రాంగణం నుంచి మంగళ వాయిద్యాలతో అమ్మవార్లను ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా నాగావళి నదీ తీర ప్రాంతానికి తరలించారు. నదీ ప్రాంతంలో శ్రీచూర్ణోత్సవంతో పాటు పలు రకాల అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర నాగావళి నదీ తీరంలో శ్రీచూర్ణోత్సవం, శ్రీచక్ర తీర్ధ స్నానాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.