కొనసాగుతున్న పొగమంచు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:52 PM
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పొగమంచు కొనసాగుతున్నది. పాడేరులో సోమవారం ఉదయ తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.

పాడేరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పొగమంచు కొనసాగుతున్నది. పాడేరులో సోమవారం ఉదయ తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం డుంబ్రిగుడలో 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ముంచంగిపుట్టులో 13.5, పెదబయలులో 13.9, హుకుంపేటలో 14.0, అనంతగిరిలో 14.1, జీకేవీధిలో 14.5, పాడేరులో 15.9, జి.మాడుగులలో 16.9, చింతపల్లిలో 17.0, కొయ్యూరులో 19.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలవడంతో ఎక్కడ పడితే అక్కడ చలిమంటలు కాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.