తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:40 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండంతో చలి తీవ్రత తగ్గడం లేదు.

మన్యంలో దట్టంగా పొగమంచు
జి.మాడుగులలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
పాడేరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండంతో చలి తీవ్రత తగ్గడం లేదు. సోమవారం జి.మాడుగులలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 9.8, జీకేవీధిలో 9.9, డుంబ్రిగుడలో 10.2, పెదబయలులో 10.8, హుకుంపేటలో 11.0, పాడేరులో 11.3, ముంచంగిపుట్టులో 12.4, చింతపల్లిలో 12.5, అనంతగిరిలో 15.1, కొయ్యూరులో 17.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు ప్రభావం కొనసాగుతున్నది. దీంతో వాహనచోదకులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు.