Share News

దట్టంగా పొగమంచు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:41 PM

మన్యంలో ప్రస్తుతం చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పాడేరులో సోమవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.

దట్టంగా పొగమంచు
పాడేరు మెయిన్‌రోడ్డులో సోమవారం ఉదయం 9 గంటలకు కురుస్తున్న పొగమంచు

పాడేరులో ఉదయం 10 గంటల వరకు వీడని మంచు తెరలు

పాడేరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో ప్రస్తుతం చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పాడేరులో సోమవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం జి.మాడుగులలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అనంతగిరిలో 16.3, అరకులోయలో 14.1, చింతపల్లిలో 15.5, డుంబ్రిగుడలో 14.2, జీకేవీధిలో 13.5, హుకుంపేటలో 15.4, కొయ్యూరులో 18.8, ముంచంగిపుట్టులో 14.5, పాడేరులో 15.8, పెదబయలులో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 17 , 2025 | 11:41 PM