పాడేరులో ఫ్లెక్సీల తొలగింపు
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:25 PM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులు
పాడేరురూరల్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం పాడేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ఎన్టీఆర్, వైఎస్సార్, ఇందిరాగాంధీ విగ్రహాలకు ముసుగులు వేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు-1 వీఆర్వో మర్రి చెట్టు రామునాయుడు, పాడేరు-2 వీఆర్వో జవ్వాది వెంకటలక్ష్మి, పాడేరు- 3 వీఆర్వో జి.రవికుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.