Share News

కొనసాగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:15 PM

మన్యంలో ప్రస్తుతం చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం స్థిరంగానే ఉన్నాయి. గురువారం ఉదయం పది గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి.

కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు- చింతపల్లి మెయిన్‌ రోడ్డులో గురువారం కమ్ముకున్న పొగమంచు

జి.మాడుగులలో 11.3 డిగ్రీలు

పాడేరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మన్యంలో ప్రస్తుతం చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం స్థిరంగానే ఉన్నాయి. గురువారం ఉదయం పది గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. జి.మాడుగులలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జీకేవీధీఽలో 11.5, చింతపల్లిలో 12.0, పాడేరులో 12.2, అరకులోయలో 12.8, డుంబ్రిగుడలో 12.6, హుకుంపేటలో 13.1, పెదబయలులో 13.9, ముంచంగిపుట్టులో 14.6, కొయ్యూరులో 16.4, అనంతగిరిలో 19.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Updated Date - Feb 13 , 2025 | 11:15 PM