అల్లూరి శత వర్ధంతి జాతా
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:02 AM
స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (ఏఐడీఎస్ఓ), విశాఖకు చెందిన పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహించారు.

స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా అఖిల భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (ఏఐడీఎస్ఓ), విశాఖకు చెందిన పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహించారు. శనివారం విశాఖలో ప్రారంభమైన ఈ యాత్ర సాయంత్రానికి నర్సీపట్నం చేరుకుంది. రాత్రికి ఇక్కడ బసచేసి ఆదివారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కు (సమాధులు)కు చేరుకుంది. అల్లూరి, గంటందొర సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అల్లూరి జీవిత చరిత్ర గురించి నాటికను, సాంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శించారు.
కృష్ణాదేవిపేట/ ఆంధ్రజ్యోతి